

తెలంగాణలో పెండింగ్లో ఉన్న రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ పేరుతో హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ దీక్ష ప్రారంభమైంది. రాష్ట్రంలోని సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపించింది.
ధర్నా చౌక్ వద్ద దీక్షకు అనుమతి నిరాకరించినప్పటికీ రాంచందర్రావు వెనక్కి తగ్గకుండా పార్టీ కార్యాలయంలోనే దీక్షకు కూర్చున్నారు. ఫీజు బకాయిల కారణంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీజేపీ పేర్కొంది. దీక్షకు విద్యార్థులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు. బకాయిల సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని పార్టీ స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!