
రాజకీయాలు

ఐదు దేశాల పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని స్వీడన్ లోని గోథెన్బర్గ్ నగరానికి చేరుకున్నారు. ప్రధాని మోదీకి అక్కడ ఘనస్వాగతం లభించింది. భారత్-స్వీడన్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన కీలకంగా భావిస్తున్నారు.
ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానం స్వీడన్ వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే, స్వీడన్ వైమానిక దళానికి చెందిన అత్యాధునిక గ్రిపెన్ యుద్ధ విమానాలు గాల్లో ప్రత్యేక ఎస్కార్ట్ ఇచ్చాయి. గౌరవ సూచకంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక స్వాగతం అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణగా నిలిచింది. మోదీ స్వీడన్ పర్యటనలో పలు కీలక చర్చలు, సమావేశాలు జరగనున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!