
టెక్నాలజీ

తెలంగాణ లో ఈ ఏడాది వానాకాలం ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి రుతుపవనాలు జూన్ 5 తర్వాతే తెలంగాణను తాకే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తొలుత ఈ నెల 25వ తేదీ నాటికే దేశ దక్షిణ ప్రాంతాన్ని రుతుపవనాలు చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా రుతుపవనాల పురోగతి మందగించినట్లు తెలుస్తోంది.
రుతుపవనాల ఆలస్యంతో రాష్ట్రంలో ప్రారంభ వర్షాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పలుచోట్ల ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతుండటంతో ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రైతులు తాజా వాతావరణ అంచనాలపై దృష్టి సారించారు. రాబోయే రోజుల్లో వర్షపాతం, రుతుపవనాల కదలికలపై మరిన్ని వివరాలను వాతావరణ శాఖ వెల్లడించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!