
సినిమాలు

మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) రాష్ట్రవ్యాప్తంగా భారీ ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా 104 ఫాస్ట్ఫుడ్ అవుట్లెట్లను అధికారులు తనిఖీ చేశారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను ఆయా సంస్థలు పాటిస్తున్నాయా అనే అంశాలను పరిశీలించారు.
ఈ తనిఖీల్లో నాలుగు డొమినోస్ పిజ్జా అవుట్లెట్లు ప్రాథమిక పరిశుభ్రత ప్రమాణాలను అందుకోలేదని అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో సంబంధిత అవుట్లెట్ల లైసెన్సులను సస్పెండ్ చేసి, నిర్దేశించిన ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పూర్తిగా పాటించే వరకు కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ చర్యల నేపథ్యంలో ఫాస్ట్ఫుడ్ సంస్థల్లో పరిశుభ్రత, ఆహార భద్రతపై వినియోగదారుల్లో మరోసారి చర్చ మొదలైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!