

కరూర్లో గత ఏడాది టీవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం రద్దు చేసింది. ముఖ్యమంత్రి విజయ్ ఇటీవల 31 కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు కార్తికేయన్, శక్తివేల్ సోమవారం తీర్పు వెలువరించారు.
విచారణ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం బదులు స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చి వారిని వ్యాపారవేత్తలుగా ఎందుకు మార్చకూడదని న్యాయమూర్తులు ప్రశ్నించారు. కారుణ్య నియామకాల కోసం చాలా మంది ఎదురుచూస్తున్న పరిస్థితిలో కేవలం కరూర్ బాధిత కుటుంబాలకు మాత్రమే ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదాలు, శివకాశిలో జరిగే బాణసంచా పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు ఇలాంటి సాయం అందించలేదని పేర్కొన్నారు. ఈ కారణాలతో ఉద్యోగ నియామకాలను రద్దు చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!