

ముగ్గురు కుమార్తెలను ఎంతో ప్రేమగా పెంచి, ఉన్నత స్థానాలకు చేర్చిన ఓ తండ్రి చివరి రోజులు వృద్ధాశ్రమంలో గడిపారు. హర్యానాలోని సోనెపట్లో ఉన్న సమాజ్ కళ్యాణ్ శిక్షా సమితి వృద్ధాశ్రమంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తన కడసారి చూపు కోసం కుమార్తెలు వస్తారని ఎదురుచూసిన శివచరణ్ రామ్ రతన్ గుప్తా చివరకు ఒంటరిగానే కన్నుమూశారు.
ముంబైలో జౌళి వ్యాపారిగా ఉన్న శివచరణ్కు ముగ్గురు కుమార్తెలు. వారి చదువు, భవిష్యత్తు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన. పెద్ద కుమార్తెను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. కొన్నేళ్ల క్రితం భార్యతో కలిసి వృద్ధాశ్రమానికి వచ్చిన ఆయన, భార్య మరణం తర్వాత అక్కడే ఒంటరిగా జీవించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి పరిస్థితి విషమంగా ఉందని ఆశ్రమ నిర్వాహకులు ముందుగానే సమాచారం ఇచ్చినా, కుమార్తెలు ఆయనను చూసేందుకు రాలేదు.
చివరకు శివచరణ్ మృతిచెందిన తర్వాత కూడా కుమార్తెలు సోనెపట్కు రాలేకపోయారు. ఒక కుమార్తె అంత్యక్రియల కోసం ఆన్లైన్లో డబ్బు పంపగా, ఆశ్రమ నిర్వాహకులు, స్థానికుల సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. ముగ్గురు కుమార్తెలు వీడియో కాల్ ద్వారా తండ్రి చివరి ప్రయాణాన్ని చూశారు. అయితే మరణానంతరం కూడా ఆయన తన నేత్రాలను దానం చేసి మరో జీవితంలో వెలుగులు నింపారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!