
జనరల్

పర్యావరణ పరిరక్షణ, హరిత ఇంధన వినియోగ దిశగా భారతీయ రైల్వే చారిత్రాత్మక ముందడుగు వేసింది. దేశంలోనే తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలు పూర్తిగా సిద్ధమై పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. ఈ రైలు సున్నా ఉద్గారాలతో (జీరో ఎమిషన్స్) పనిచేసేలా రూపొందించబడింది.
ఉత్తర రైల్వే పరిధిలోని జీంద్ సోనిపట్ మార్గంలో ఈ రైలును నడపడానికి అనుమతి లభించింది. గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలులో 10 కోచ్లు ఉంటాయి. ఇది 1200 కిలోవాట్ సామర్థ్యం గల శక్తివంతమైన ఇంజన్తో పనిచేస్తుంది.
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో నడిచే ఈ రైలు కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. దీంతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. ఈ ప్రాజెక్ట్తో భారత్ క్లీన్ ఎనర్జీ రైలు రవాణా రంగంలో ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన చేరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!