

తిరుపతి జిల్లాలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఈ నెల 10న నమోదైన కేసులో రేణిగుంట పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో గోవిందరాజ స్వామి ఆలయం అర్చక భవన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగి రాహుల్ యాదవ్ కూడా ఉన్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.3 లక్షల విలువైన 63 గ్రాముల మెత్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తులో ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టీటీడీ ఉద్యోగి, ఇంజినీరింగ్ విద్యార్థి ఈ కేసులో ఉండటం పలు అనుమానాలకు తావిచ్చింది. డ్రగ్స్ సరఫరా, వినియోగానికి సంబంధించిన నెట్వర్క్ను గుర్తించేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్నట్లు అనుమానిస్తున్న వారికి బయో-చెక్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!