

అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగి రిషికేశ్ రాజ్ మీసాలా టెక్సాస్కు చెందిన ఓ సంస్థపై కోర్టులో దావా వేశారు. హెచ్-1బీ వీసా హోదాను కొనసాగించాలంటే భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాలని సంస్థ తనపై ఒత్తిడి తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు. విద్యార్థి వీసాపై అమెరికాకు వెళ్లిన రిషికేశ్, 2023లో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత హెచ్-1బీ స్పాన్సర్షిప్తో ఉద్యోగంలో చేరినట్లు పేర్కొన్నారు.
రిజర్వ్ బెంచ్లో ఉంచి పని కేటాయించకపోయినా, ఉద్యోగంలో కొనసాగుతున్నట్లు చూపించేందుకు చెల్లింపులు చేయాలని సంస్థ కోరిందని ఆయన దావాలో పేర్కొన్నారు. అదనంగా పే స్టబ్స్ ఇవ్వకుండా నిరాకరించారని, ప్రశ్నిస్తే ఇమిగ్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారని ఆరోపించారు. Banias Law సంస్థ ద్వారా దాఖలైన ఈ దావాలో, చెల్లించని వేతనాలు మరియు బలవంతపు చెల్లింపులతో కలిపి 97,248 డాలర్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలు ఇంకా కోర్టులో రుజువు కాలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!