
బిజినెస్

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. ఈ సేవలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ చి. వెంకయ్య చౌదరి, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ బి. శ్రీధర్ వర్మ, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ బి. శ్రీధర్ వర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి హారతి సమర్పించి ప్రార్థనలు చేశారు. దేశ ప్రజలందరి సుఖసంతోషాలు, శ్రేయస్సు, అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. హనుమంత వాహన సేవ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!