
జనరల్

రాష్ట్ర ప్రభుత్వం రూ.2000 కోట్ల అప్పు సేకరించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకుకు ప్రతిపాదనలు పంపించింది. వచ్చే మంగళవారం నిర్వహించే విద్యుత్ వేలం ద్వారా ఈ రుణాన్ని సమీకరించనున్నట్లు వెల్లడించింది. మొత్తం మూడు విడతల్లో ఈ అప్పును సేకరించేందుకు చర్యలు చేపట్టింది.
7.54 శాతం వార్షిక వడ్డీతో 2033 నాటికి చెల్లించే విధంగా రూ.750 కోట్లు, 7.70 శాతం వడ్డీతో 2037 నాటికి చెల్లించేలా రూ.500 కోట్లు, 7.82 శాతం వడ్డీతో 2047 నాటికి చెల్లించేలా మరో రూ.750 కోట్లకు ప్రతిపాదనలు సమర్పించింది. మొత్తం ఆరు రాష్ట్రాలు కలిపి రూ.20,100 కోట్ల రుణాల కోసం ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!