
క్రీడలు

ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు (ASE)– మే 2026 ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 94,990 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 78,261 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఉత్తీర్ణత శాతం 82.39 శాతంగా నమోదైంది. గత ఏడాది నమోదైన 76.14 శాతంతో పోలిస్తే ఈసారి 6.25 శాతం పెరుగుదల కనిపించింది.

ఈ విజయవంతమైన ఫలితాలకు ప్రభుత్వం అమలు చేసిన 20 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ప్రధాన కారణమని అధికారులు పేర్కొన్నారు. ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల అనంతరం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, అకాడమిక్ సహాయం, వ్యక్తిగత మార్గదర్శకత్వం అందించడంతో ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల సాధ్యమైంది. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలను ప్రభుత్వం అభినందించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!