
సినిమాలు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నేడు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొత్తం 250 మంది చిన్నారులకు ఉచితంగా అక్షరాభ్యాసం చేయించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యారంభానికి ప్రతీకగా నిర్వహించే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు.
అక్షరాభ్యాసం అనంతరం పాల్గొన్న చిన్నారులు, వారి తల్లిదండ్రులకు ₹300 ప్రత్యేక దర్శన క్యూ లైన్లో ఉచిత దర్శన సౌకర్యం కల్పించనున్నారు. అలాగే పలక, బలపం, శక్తి కంకణం, పాకెట్ సైజ్ అమ్మవారి ఫోటో, 100 గ్రాముల పులిహోర, చక్కెర పొంగలి, 40 గ్రాముల ఉచిత లడ్డూను ప్రసాదంగా అందజేయనున్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!