
రాజకీయాలు

బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్లోని బంకిపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాల్లో జూలై 30న పోలింగ్ నిర్వహించనున్నారు. ఆగస్టు 4 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.
ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూలై 13 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. జూలై 14న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, జూలై 16 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(1)(e) ప్రకారం మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హతకు గురికావడంతో మధ్యప్రదేశ్లోని దతియా అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!