

ప్రభుత్వం నుంచి గత ఏడు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరాను కాంట్రాక్టర్లు నిలిపివేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి సరఫరా నిలిపివేసినట్లు ప్రకటించిన కాంట్రాక్టర్లు, బకాయిలు పూర్తిగా చెల్లించిన తర్వాతే తిరిగి సరఫరా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే పోషకాహార పంపిణీపై ప్రభావం పడే అవకాశం ఉంది.
రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,780 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తుండగా, 21 లక్షలకు పైగా లబ్ధిదారులు ఈ సేవలను పొందుతున్నారు. కాంట్రాక్టర్లు 11 నెలల పాటు గుడ్లు సరఫరా చేసినప్పటికీ కేవలం నాలుగు నెలల బిల్లులే చెల్లించారని, ఇంకా రూ.125 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పలుమార్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాకపోవడంతో సరఫరాను నిలిపివేసినట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!