

ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు ఆహార భద్రత కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. జిల్లాలో మొత్తం 2,96,456 రేషన్ కార్డులకు సంబంధించిన 7,59,231 మంది లబ్ధిదారులు వేలిముద్రల ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నారు. ఇంకా 1,33,982 మంది లబ్ధిదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. జూలై 31ను తుది గడువుగా నిర్ణయించగా, ఈ-కేవైసీ పూర్తయిన వారికే వచ్చే నెల నుంచి రేషన్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మృతిచెందిన వారు, ఏళ్లుగా రేషన్ తీసుకోని వారు, విదేశాలకు వెళ్లిన వారి కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే వేలిముద్రలు నమోదు కాకపోవడం, ఆధార్ అనుసంధాన సమస్యలు, వివరాల్లో తప్పులు వంటి కారణాలతో ఈ-కేవైసీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. లబ్ధిదారులు దేశంలోని ఎక్కడి నుంచైనా సమీప రేషన్ దుకాణంలో ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. వృద్ధులకు వేలిముద్రలు పడకపోతే ఐరిష్ ద్వారా నవీకరణ చేసే అవకాశం కల్పించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!