
సినిమాలు

అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామంలో చిత్తూరు టాస్క్ఫోర్స్ పోలీసులు భారీ ఎర్రచందనం డంప్ను గుర్తించారు. గ్రామానికి చెందిన జయరాం సహా ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 109 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులకు చెందిన ఒక కారును కూడా సీజ్ చేశారు.
ఈ ఎర్రచందనం దుంగలను ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడుకు తరలించేందుకు స్మగ్లింగ్ ముఠా ప్రయత్నిస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఎర్రచందనం స్మగ్లింగ్ 70 శాతం తగ్గిందని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!