30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ గడువు పెంచాలి.. సీఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

Writer: Chandrika 06:20 AM, 30 ఆగస్టు, 2026
తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ గడువు పెంచాలి.. సీఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించేందుకు ఉన్న గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌కు శనివారం రాసిన లేఖలో.. రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేనందున ఓటర్ల జాబితా సవరణను సమగ్రంగా నిర్వహించేందుకు తగిన సమయం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం సెప్టెంబరు 16 వరకు ఉన్న గడువును మరో నాలుగు వారాలు పొడిగించడంతో పాటు, అక్టోబరు 19న ప్రచురించాల్సిన తుది ఓటర్ల జాబితా తేదీని కూడా మార్చాలని కోరారు. 2026 జూన్‌ 10 నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 73.39 లక్షల మందిని గైర్హాజరు, నివాసం మారిన, మృతి చెందిన, డూప్లికేట్‌ (ASDD) ఓటర్లుగా గుర్తించినట్లు లేఖలో పేర్కొన్నారు. డిజిటలైజ్‌ చేసిన ఎన్యూమరేషన్‌ పత్రాల్లోని లోపాలు, గత జాబితాతో అనుసంధానం కాని ఫారాల కారణంగా సుమారు 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

SIR ప్రక్రియలో కొన్ని కీలక లోపాలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తాత్కాలికంగా ఇళ్లలో లేని వారిని, శాశ్వతంగా నివాసం మారిన వారిని ఒకే విధంగా పరిగణించకూడదని సూచించారు. ఓటరు పేరు తొలగించే ముందు అధికారిక నోటీసు ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ (FRC)తో పాటు మండల స్థాయి అధికారులు జారీ చేసే గుర్తింపు పత్రాలను కూడా అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలు, పురపాలిక వార్డుల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, పోలింగ్‌ కేంద్రాల స్థాయిలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం, అవసరమైన చోట అదనపు ఏఈఆర్వోలను నియమించడం ద్వారా ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు పేరు కూడా తొలగిపోకుండా, అనర్హుల పేర్లు జాబితాలో ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. SIR ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్తులన్నీ పోయాయి.. అద్దె ఆదాయంతో జీవిస్తున్నా: జీ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర

ఆస్తులన్నీ పోయాయి.. అద్దె ఆదాయంతో జీవిస్తున్నా: జీ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర

భారత్‌లో గ్లోబల్‌ సెంటర్లకు విదేశీ సంస్థల క్యూ..

భారత్‌లో గ్లోబల్‌ సెంటర్లకు విదేశీ సంస్థల క్యూ..

హైదరాబాద్‌కు సమీపంలో అద్భుత శివక్షేత్రం..

హైదరాబాద్‌కు సమీపంలో అద్భుత శివక్షేత్రం..

రాఘవేంద్ర స్వామి సజీవ బృందావనం.. మంత్రాలయం మహిమకు ఇదే నిదర్శనం!

రాఘవేంద్ర స్వామి సజీవ బృందావనం.. మంత్రాలయం మహిమకు ఇదే నిదర్శనం!

రాశిఫలాలు: నేడు 12 రాశుల వారికి ఎలా ఉంది?
ట్యాగ్లు
తెలంగాణ SIRరేవంత్‌రెడ్డితెలంగాణ ఓటర్ల జాబితాకేంద్ర ఎన్నికల సంఘంజ్ఞానేశ్‌కుమార్ప్రత్యేక సమగ్ర సవరణఓటర్ల ధ్రువీకరణఓటర్ల జాబితాతెలంగాణ రాజకీయాలుఓటర్ల హక్కులు
Advertisement

రాశిఫలాలు: నేడు 12 రాశుల వారికి ఎలా ఉంది?

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జపాన్‌ కంపెనీలకు మంత్రి వివేక్‌ పిలుపు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జపాన్‌ కంపెనీలకు మంత్రి వివేక్‌ పిలుపు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
జనరల్

మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆస్తులన్నీ పోయాయి.. అద్దె ఆదాయంతో జీవిస్తున్నా: జీ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర
జనరల్

ఆస్తులన్నీ పోయాయి.. అద్దె ఆదాయంతో జీవిస్తున్నా: జీ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర

భారత్‌లో గ్లోబల్‌ సెంటర్లకు విదేశీ సంస్థల క్యూ..
జనరల్

భారత్‌లో గ్లోబల్‌ సెంటర్లకు విదేశీ సంస్థల క్యూ..

టీమిండియాకు టైటిల్‌ స్పాన్సర్‌ కరవు..
క్రీడలు

టీమిండియాకు టైటిల్‌ స్పాన్సర్‌ కరవు..

‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ‘అర్జున్ రెడ్డి’...
సినిమాలు

‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ‘అర్జున్ రెడ్డి’...

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ గడువు పెంచాలి.. సీఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
జనరల్

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ గడువు పెంచాలి.. సీఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

నేటి నుంచి భారత మహిళల టీ20 ఆసియాకప్‌ పోరాటం...
క్రీడలు

నేటి నుంచి భారత మహిళల టీ20 ఆసియాకప్‌ పోరాటం...

సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..
రాజకీయాలు

సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..

హైదరాబాద్‌కు సమీపంలో అద్భుత శివక్షేత్రం..
జనరల్

హైదరాబాద్‌కు సమీపంలో అద్భుత శివక్షేత్రం..

రాఘవేంద్ర స్వామి సజీవ బృందావనం.. మంత్రాలయం మహిమకు ఇదే నిదర్శనం!
జనరల్

రాఘవేంద్ర స్వామి సజీవ బృందావనం.. మంత్రాలయం మహిమకు ఇదే నిదర్శనం!

రాశిఫలాలు: నేడు 12 రాశుల వారికి ఎలా ఉంది?
జనరల్

రాశిఫలాలు: నేడు 12 రాశుల వారికి ఎలా ఉంది?

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జపాన్‌ కంపెనీలకు మంత్రి వివేక్‌ పిలుపు
జనరల్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జపాన్‌ కంపెనీలకు మంత్రి వివేక్‌ పిలుపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!