
షోస్

తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ హాల్ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ప్రారంభించారు. మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు సేవలను స్మరించుకుంటూ ఈ సెంట్రల్ హాల్కు ఆయన పేరు పెట్టారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి గౌరవ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!