

బిహార్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రతి మూడు నెలలకు ఒకసారి కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ఆదేశించింది. అలాగే ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, పర్యాటక అభివృద్ధిపై సూచనలు ఇస్తూ నివేదికలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి అన్ని శాఖాధిపతులు, కలెక్టర్లు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ పర్యటనల్లో ఉద్యోగులు తమ సొంత జిల్లాను మినహాయించి ఇతర జిల్లాల్లోని కనీసం మూడు పర్యాటక ప్రదేశాలను సందర్శించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎకో టూరిజం, గ్రామీణ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. శుక్ర, శని వారాల్లో కనీసం రెండు రోజులు అక్కడ గడపాల్సి ఉండగా, ఈ టూర్లను అధికారిక విధుల్లో భాగంగానే పరిగణిస్తామని ప్రభుత్వం తెలిపింది. బిహార్లోని చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!