
జనరల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వంగా వచ్చే వ్యవసాయ భూముల బదలాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇకపై వారసత్వ భూముల పేరుమార్పిడి కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా స్వయంచాలక పేరుమార్పిడి విధానం అమలు చేయనుంది. భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో వారసుల పేర్లు స్వయంగా నమోదు కానున్నాయి.
వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లో భాగంగా రూ.10 లక్షల లోపు విలువైన భూములకు రుసుమును కేవలం రూ.100గా ప్రభుత్వం నిర్ణయించింది. వీలునామా లేకపోతే రిజిస్ట్రేషన్ సమయంలో కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే తక్కువ రుసుముతో రిజిస్ట్రేషన్లకు అనుమతించిన ప్రభుత్వం, తాజాగా స్వయంచాలక పేరుమార్పిడి విధానం ద్వారా ప్రజలకు మరింత సౌలభ్యం కల్పిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!