

భారత వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్, అక్టోబర్ 27–28 తేదీల్లో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో యూరోపియన్ యూనియన్ ట్రేడ్ కమిషనర్ మారోస్ సెఫ్కోవిక్ ను కలవనున్నారు. ఈ పర్యటనతో భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య జరుగుతున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) చర్చలు కీలక దశకు చేరుకున్నాయి.ఈ పర్యటన ప్రధాన లక్ష్యం రెండు దేశాల మధ్య సమగ్రం, సమతుల్యం మరియు పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం దిశగా రాజకీయ దిశానిర్దేశం ఇవ్వడం మరియు చర్చలకు కొత్త ఊపుని తీసుకురావడం.వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకారం, చర్చల్లో ప్రధానంగా మార్కెట్ యాక్సెస్, నాన్-టారిఫ్ మేజర్లు, మరియు రెగ్యులేటరీ కోఆపరేషన్ వంటి కీలక అంశాలు చర్చించబడతాయి. ఇప్పటివరకు సాధించిన పురోగతిని సమీక్షించడం, ఇంకా ఏ అంశాలలో ఒకాభిప్రాయం అవసరమో గుర్తించడం కూడా ఈ పర్యటనలో భాగం.
ఈ నెల ప్రారంభంలో జరిగిన 14వ రౌండ్ FTA చర్చలు అనంతరం ఈ పర్యటన జరుగుతోంది. ఇరు పక్షాలు ఒక న్యాయమైన మరియు భవిష్యత్ దృష్టి ఉన్న ఒప్పందం సాధించడానికి కట్టుబడి ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశాయి.గోయల్ బ్రస్సెల్స్ పర్యటనలో ద్వైపాక్షిక సమావేశం మరియు వర్కింగ్ డిన్నర్ ఉంటాయి. ఇందులో ఇరు నాయకులు భారత్–యూరోపియన్ యూనియన్ వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత బలపర్చే దిశగా చర్చించనున్నారు.ఈ చర్చలు ప్రధాని నరేంద్ర మోదీ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ల మధ్య జరిగిన సమావేశం తర్వాత కొనసాగుతున్న వ్యూహాత్మక వేగాన్ని మరింత బలపరుస్తాయి. ఆ సమావేశంలో భవిష్యత్తు దృష్టితో కూడిన, సుస్థిరమైన మరియు ఆవిష్కరణాత్మక వాణిజ్య సంబంధాల అవసరాన్ని ఇద్దరు నాయకులు ప్రాముఖ్యతనిచ్చారు.
ఈ బ్రస్సెల్స్ పర్యటన భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ఉన్న కీలక వాణిజ్య చర్చలను స్పష్టమైన ఫలితాల వైపు తీసుకెళ్లే మరో ముఖ్య అడుగుగా భావిస్తున్నారు.
.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!