

బడ్జెట్ హోటళ్ల సంస్థ ఓయో మాతృసంస్థ ప్రిజమ్ రూ.6,650 కోట్ల తొలి పబ్లిక్ ఆఫరింగ్ కోసం సెబీకి సవరించిన దరఖాస్తు పత్రాలను సమర్పించింది. ఈ నిధులన్నింటినీ తాజా ఈక్విటీ జారీ ద్వారానే సమీకరించనున్నట్లు వెల్లడించింది. అలాగే ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్ ద్వారా రూ.1,330 కోట్ల వరకు సమీకరించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఈ ఐపీఓలో వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్, ప్రధాన పెట్టుబడిదారు సాఫ్ట్బ్యాంక్ సహా ప్రస్తుత వాటాదారులు తమ వాటాలను విక్రయించడం లేదు.
ప్రిజమ్లో సాఫ్ట్బ్యాంక్కు 40.04 శాతం వాటా ఉండగా, రితేశ్ అగర్వాల్ వాటా 30.52 శాతంగా ఉంది. వీరిద్దరి కలిపి వాటా 70.56 శాతం. మిగిలిన వాటాలను మైక్రోసాఫ్ట్, ఎయిర్బీఎన్బీ, ఖజానా, పీక్ ఎక్స్వీ, లైట్స్పీడ్ తదితర సంస్థలు కలిగి ఉన్నాయి. ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో రూ.4,987.5 కోట్లను రుణాల చెల్లింపులకు వినియోగించనున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం సంస్థ నికర రుణభారం రూ.6,828 కోట్లుగా ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!