

ఎస్బీఐ కార్డ్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్ జారీ చేసింది. ఫోన్పేతో కలిసి అందిస్తున్న కో బ్రాండెడ్ కార్డుల రివార్డు పాయింట్ల ప్రోగ్రామ్లో మార్పులు చేసింది. ఫోన్పే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పర్పుల్, ఫోన్పే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ బ్లాక్ కార్డులకు కొత్త పరిమితులు విధించింది. వచ్చే నెల 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.
ఫోన్పే ఎస్బీఐ పర్పుల్ కార్డులో ఫోన్పే మరియు ఆన్లైన్ లావాదేవీలపై గరిష్ఠ రివార్డు పాయింట్లు తగ్గించబడ్డాయి. ఇన్సూరెన్స్ బిల్లులపై నెలకు 250 పాయింట్లు, ఇతర లావాదేవీలపై 750 పాయింట్లు మాత్రమే లభిస్తాయి. ఆన్లైన్ రివార్డులు కూడా 1000 నుంచి 750కి తగ్గించారు. ఇక సెలెక్ట్ బ్లాక్ కార్డులో ఇన్సూరెన్స్ చెల్లింపులకు 500 పాయింట్లు, మిగిలిన వాటికి 1500 పాయింట్లు పరిమితి పెట్టారు. ఆన్లైన్ రివార్డులు 2000 నుంచి 1000కి తగ్గించారు. టోల్, గిఫ్టులు, బంగారం కొనుగోలు, ఎడ్యుకేషన్ చెల్లింపులు, ఇతర ప్లాట్ఫారమ్లపై చేసే యుటిలిటీ లేదా ఇన్సూరెన్స్ చెల్లింపులకు ఇక రివార్డు పాయింట్లు ఉండవు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!