
సినిమాలు

రెజ్లర్ వినేశ్ ఫొగాట్ 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే ఆశలకు గట్టి దెబ్బ తగిలింది. శనివారం జరిగిన ఏషియన్ గేమ్స్ సెలెక్షన్ ట్రయల్స్లో సెమీ ఫైనల్లో ఆమె పరాజయం పాలయ్యారు. 53 కిలోల విభాగంలో మీనాక్షి గోయత్ చేతిలో 4-6 తేడాతో ఓడిపోయారు. మ్యాచ్ అంతా హోరాహోరీగా సాగినా చివరికి విజయం మీనాక్షి గోయత్కే దక్కింది.
ట్రయల్స్లో పాల్గొనడానికి వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్ సమాఖ్యతో న్యాయపోరాటం చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. మ్యాచ్ అనంతరం ఆమె తీవ్ర భావోద్వేగంతో స్పందిస్తూ తాను కేవలం ప్రత్యర్థులతోనే కాక వ్యవస్థతో కూడా పోరాడుతున్నానని, న్యాయం జరగలేదని వ్యాఖ్యానించారు. తాను తిరిగి వస్తానని తెలిపారు. 2018 ఆసియా క్రీడల్లో ఆమె స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!