
సినిమాలు

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ 2026 సీజన్లో ఇంకా రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందులో మే 18న చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్పై భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఎంఎస్ ధోని ఈ మ్యాచ్లో ఆడి రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే “ఈ మ్యాచ్లో ఒక సర్ప్రైజ్ ఉండొచ్చు” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు లఖ్నవూతో మ్యాచ్లో అన్షుల్ కాంబోజ్ బౌలింగ్పై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంబోజ్ 2.4 ఓవర్లలో 63 పరుగులు ఇచ్చి ఎనిమిది సిక్స్లు సమర్పించుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లకు పదేపదే షార్ట్ బాల్స్ వేయడం పెద్ద తప్పిదమని శ్రీకాంత్ విమర్శించారు. ఒత్తిడికి గురై బౌలింగ్ వ్యూహాన్ని మార్చుకోలేకపోయాడని ఆయన అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!