
క్రీడలు

దిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2026లో తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ జట్టు 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్థాన్కు ఇది వరుసగా మూడో ఓటమి.
దిల్లీ తరఫున కేఎల్ రాహుల్ 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, అభిషేక్ పొరెల్ 51 పరుగులతో రాణించాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ 34 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టగా, దసున్ షనక ఒక వికెట్ సాధించాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!