

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026’ ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్బాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆబిడ్స్లోని పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రోడ్షోలు, ఎంవోయూలు, పారిశ్రామిక పెట్టుబడులు, లాజిస్టిక్స్, ప్రోటోకాల్, హాస్పిటాలిటీ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించి యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్బాబు తెలిపారు. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా మరింత బలోపేతం చేసేలా కొత్త పాలసీలను తీసుకురానున్నట్లు చెప్పారు. సమ్మిట్లో కుదిరే ఎంవోయూలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని, ప్రతి శాఖకు స్పష్టమైన బాధ్యతలు, టైమ్లైన్లు నిర్దేశించి ఏర్పాట్లను గడువులోగా పూర్తి చేస్తామని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!