
రాజకీయాలు

న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరగనున్న ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ అనంతరం, ఆ మ్యాచ్లో ఉపయోగించిన పిచ్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి విక్రయించాలని ఫిఫా నిర్ణయించింది. అభిమానులకు చారిత్రక జ్ఞాపకంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతి పిచ్ ముక్క ధరను 450 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.38 వేల)గా నిర్ణయించినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ అభిమానులు, స్పోర్ట్స్ మెమొరబిలియా సేకరించే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ విక్రయాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది.
అయితే, పిచ్ను కూడా విక్రయానికి పెట్టడం సరైన నిర్ణయం కాదంటూ సోషల్ మీడియాలో ఫిఫాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ అరుదైన జ్ఞాపికకు అభిమానుల నుంచి భారీ స్పందన లభించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!