

తెలంగాణలో బీజేపీ పరిస్థితి సున్నాగా మారిందని టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రానికి రావడం ఆశ్చర్యకరమని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏమీ కేటాయించకుండా, రాష్ట్రానికి ఏమీ ఇవ్వని నేతలు ఎలా పర్యటిస్తారని నిలదీశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ పరంగా స్థానిక ఇన్చార్జ్ మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన పొరపాట్లను సరిదిద్దాలని ఇప్పటికే సూచించినట్లు మహేష్ గౌడ్ తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారని, కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సహకరిస్తున్నారని చెప్పారు.
పవన్ కల్యాణ్పై కూడా మహేష్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ను బీజేపీ నేతలు “భిక్షాం దేహి” అంటూ అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ నాయకుడని, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. గతంలో తెలంగాణపై ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రజలు మర్చిపోలేదని, అందుకే తెలంగాణ ప్రజలు ఆయన మాటలకు ఓటు వేయరని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ తన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కే పరిమితం చేయాలని సూచించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!