

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇటీవల వైరల్ అవుతున్న “కాక్రోచ్ జనతా పార్టీ” ఉద్యమానికి మద్దతు తెలిపినట్లు టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన అంతర్గత సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిగిందని, యువతలో వైరల్ అవుతున్న ఈ ఉద్యమంపై పార్టీ నేతలు ఆసక్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
ఇటీవల సోషల్ మీడియాలో మీమ్స్, వ్యంగ్య పోస్టులు, నిరుద్యోగం, పరీక్షల లీకులు, యువత అసంతృప్తి వంటి అంశాలపై “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ఉద్యమానికి కొంతమంది ప్రతిపక్ష నేతలు కూడా స్పందించడం గమనార్హం. మరోవైపు సోషల్ మీడియాలో ఈ క్యాంపెయిన్పై పరిమితులు, వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశం రాజకీయంగానే కాకుండా డిజిటల్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!