

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు Xi జిన్పింగ్ గురువారం దక్షిణ కొరియా నగరం బుసాన్లో కీలక సమావేశం నిర్వహించారు. 2019 తర్వాత ఇద్దరు నాయకులు కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఇరుదేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం పరిస్థితుల్లో పరిష్కార మార్గాలపై చర్చలు జరిగాయి. బుసాన్లోని ఎయిర్ఫోర్స్ బేస్లో ఉన్న నరైమారు హాల్లో ఈ సమావేశం జరిగింది. ట్రంప్, ఎపెక్ సమావేశాలు ముగించుకుని గ్యోంగ్జు నుండి వచ్చారు. Xi మూడు రోజుల అధికార పర్యటనలో భాగంగా బుసాన్ చేరుకున్నారు. “ఇది చాలా విజయవంతమైన సమావేశం అవుతుంది,” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చల్లో ప్రధాన అంశం చైనా ఒక సంవత్సరం పాటు రేర్ ఎర్త్ ఎగుమతులపై కొత్త పరిమితులను నిలిపివేయడం, దానికి బదులుగా అమెరికా నవంబర్ 1 నుండి విధించాల్సిన 100% సుంకాలను రద్దు చేయడం పై ఒప్పందం సాధ్యమవుతుందన్నది.
ఇరుదేశాల అధికారులు వారాంతంలో ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అయితే ప్రధాన సమస్యలు ఇంకా మిగిలే ఉన్నాయి. చైనా అమెరికా సోయాబీన్ దిగుమతులను నిలిపివేయడంతో అమెరికా రైతులు నష్టపోతున్నారు. మరోవైపు, అమెరికా చైనా నుండి ఫెంటనిల్ తయారీలో ఉపయోగించే రసాయనాల ఎగుమతులను తగ్గించమని ఒత్తిడి పెడుతోంది. భద్రతా అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి — ఉత్తర కొరియా అణు ప్రోగ్రాం, చైనా–తైవాన్ ఉద్రిక్తతలు, దక్షిణ చైనా సముద్రంపై చైనా హక్కుల దావాలు వంటి విషయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తైవాన్ అంశంపై ట్రంప్ స్పష్టంగా “దానిపై పెద్దగా మాట్లాడకపోవచ్చు. ఆయన అడిగితేనే మాట్లాడుతాం,” అని చెప్పారు.










కామెంట్స్ (2)
Big moment in global politics 👏 Hope it brings peace and progress.
భద్రతా అంశాలపై కూడా దృష్టి సారించడం అవసరం