

రష్యా రాష్ట్రపతి వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో అందించిన ఆతిథ్యంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య అనేక అంశాలపై చర్చలు జరిగాయి మరియు పరస్పర అవగాహన ఒప్పందాలు కుదిరాయి. రష్యా-భారత్ మధ్య ప్రస్తుతం 64 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోందని పుతిన్ తెలిపారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల వ్యాపార లక్ష్యాన్ని చేరుకోవడం రెండు దేశాల లక్ష్యమని చెప్పారు. వాణిజ్య విస్తరణ, సంయుక్త ప్రాజెక్టుల పురోగతి, సాంకేతిక అభివృద్ధిలో పరస్పర సహకారం కొనసాగించడం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
పుతిన్ భారతదేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కుడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అలాగే రక్షణ, ఆరోగ్య రంగాల్లో కలిసి పనిచేయడం మరియు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మద్దతునివ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదే భారత్ అధ్యక్షతన BRICS సమ్మిట్ జరుగుతుందని కూడా ఆయన తెలిపారు. ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని మరింత పెంపొందించే అవకాశాన్ని కల్పిస్తుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!