

సిలిగురిలో జరిగిన అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. రాష్ట్రపతి పర్యటన సమయంలో ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. మార్చి 7న జరిగిన ఈ కార్యక్రమంలో చిన్న వేదిక ఏర్పాటు చేయడం, తక్కువ మంది హాజరు కావడం, ముఖ్యమంత్రి సహా పలువురు రాష్ట్ర నాయకులు గైర్హాజరు కావడంపై రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలను బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని మమతా బెనర్జీ విమర్శించారు. రాష్ట్రపతి కార్యక్రమాన్ని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం సరిగా నిర్వహించలేదని బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆమె తప్పుపట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!