

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోనే కాకుండా బీజేపీ ముఖ్యనేతలతోనూ హరీశ్రావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. దీనికి సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణల్లో హరీశ్రావు పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ఆయనను అరెస్టు చేయకుండా కేసుల నుంచి రక్షిస్తున్నారని విమర్శించారు. ఇటీవల లండన్ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి, హరీశ్రావు రహస్యంగా సమావేశమయ్యారని ఆరోపించిన కవిత, ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం లేకపోతే హరీశ్రావును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత, హరీశ్రావు బీఆర్ఎస్ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల మెదక్ జిల్లా ఎమ్మెల్యేలతో జరిగిన రహస్య సమావేశంలో కేసీఆర్ వారసత్వం కేటీఆర్కు వెళ్లకూడదని హరీశ్రావు వ్యాఖ్యానించినట్లు తనకు సమాచారం అందిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలను ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు రాజీ పడ్డారని ఆరోపించారు. ఒకరు ఇరిగేషన్, వ్యాపార ప్రయోజనాలు, మరొకరు రియల్ ఎస్టేట్, ఇసుక వ్యాపారాలకు సంబంధించిన అంశాల్లో రాజీ రాజకీయాలు చేస్తున్నారని కవిత విమర్శించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!