

కల్వకుంట్ల కవిత స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి బోడ జనార్ధన్ తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో కవిత ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన నేతగా బోడ జనార్ధన్కు గుర్తింపు ఉంది. చెన్నూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ అనుభవజ్ఞులైన నేతల చేరికతో టీఆర్ఎస్కు కొత్త బలం వచ్చిందన్నారు. వారి అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని, అనుచరులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అలాగే సింగరేణి సమస్యలు, ఆర్టీసీ విలీనం అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా కొత్త ప్రణాళికను త్వరలో ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!