
ఓటీటీ

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న “నవ నిర్మాణ సభ” తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, పవన్ కల్యాణ్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ ప్రెస్ మీట్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం ఇంట్లో ప్రెస్ మీట్కు కూడా అనుమతి ఇవ్వకూడదని ఆయన అన్నారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ను ఉపయోగించుకుంటోందని, తెలంగాణలో వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!