
ఓటీటీ

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించింది. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రతినిధి బృందం అధికారులను కోరింది.
ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బలమురి వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, నవీన్ యాదవ్, శ్రీ గణేష్, కార్పొరేషన్ చైర్మన్లు మరియు ఇతర ముఖ్య కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!