

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతున్న తమిళ్ వెబ్ సిరీస్ ‘ఎగ్జామ్’ దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షిస్తోంది. బోర్డ్ పరీక్షల ఫలితాల సమయంలో విడుదలైన ఈ సిరీస్, చదువుల ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక పరిస్థితులను హృదయాన్ని కదిలించేలా చూపిస్తోంది. కోచింగ్ సెంటర్ల ఒత్తిడి, తల్లిదండ్రుల అంచనాలు, మార్కుల కోసం జరిగే పోటీ వంటి అంశాలను చాలా సహజంగా ఆవిష్కరించారు.
మనోజ్ లియోనెల్ జాన్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషల్ రియలిస్టిక్ డ్రామా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థుల ఆరోగ్యం కంటే మార్కులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న వ్యవస్థపై ఈ సిరీస్ కీలక చర్చకు దారితీసింది. తమిళ్తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉండటంతో దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!