

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అత్యంత నమ్మకమైన హాస్య హీరోలలో అల్లరి నరేష్ ఒకరు. అల్లరి, బెండ్ అప్పారావ్, సుడిగాడు వంటి సినిమాలతో ప్రేక్షకులను ఏకంగా దశాబ్దం పాటు నవ్వించాడు. అయితే, సుడిగాడు తరువాత అదే హాస్య శైలి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మార్కెట్ మారడం, టీవీలో హాస్య కార్యక్రమాలు పెరగడం వంటి కారణాలతో నరేష్ స్టైల్కు ఆదరణ తగ్గింది. దీంతో ఆయన తన కెరీర్ను మార్గం మార్చాల్సి వచ్చింది.
సీరియస్ పాత్రలవైపు మళ్లిన నరేష్, నాంది సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇటు మారేదుమిల్లి ప్రజానీకం, ఉగ్రం, ఆ ఒక్కటి అడక్కు, బచ్చల మల్లి, 12 ఏ రైల్వే కాలనీ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకాధరణ పొందలేకపోయాయి. ప్రస్తుతం కామెడీ గానీ, సీరియస్ రోల్స్ గానీ స్థిరంగా వర్క్ కాకపోవడంతో నరేష్ కెరీర్ కీలక దశలో ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముందుకు సాగాలంటే ఒక బలమైన స్క్రిప్ట్ లేదా ప్రత్యేక పాత్ర కీలకంగా మారనున్నట్లు అంచనా వేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!