
సినిమాలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామాను దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార సమాచారం సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ కీలక దశను చేరుకుంది. దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. వంద రోజుల చిత్రీకరణను పూర్తి చేసిన చిత్రబృందం, మిగిలిన భాగాన్ని త్వరలో ముగించి పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయాలని ప్రణాళిక వేసుకుంటోంది. బ్రిటీష్ కాలం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా విజువల్గా ప్రత్యేక అనుభూతిని అందించనుందని టాక్ వినిపిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!