
సినిమాలు

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్నారు. ప్రస్తుతం కృతి సనన్, రష్మిక మందన్నలతో కలిసి నటించిన ‘కాక్టెయిల్ 2’ సినిమా ఈ నెల 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న షాహిద్ తన వరుస ప్లాపులపై స్పందిస్తూ కథల ఎంపిక విధానాన్ని పూర్తిగా మార్చుకున్నట్లు వెల్లడించారు.
సినిమాల ఫలితాలను ముందుగా అంచనా వేయడం కష్టమని, ఒక నటుడిగా చివరి ఫలితంపై పూర్తి నియంత్రణ ఉండదని ఆయన చెప్పారు. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడం తనపై మానసికంగా ప్రభావం చూపిందని అంగీకరించారు. ఇకపై కథలు వినేటప్పుడు ఒంటరిగా కాకుండా తనతో పాటు మరో ముగ్గురు సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘కాక్టెయిల్ 2’తో తన కెరీర్కు మలుపు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!