

తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన నటుడు, మాజీ మంత్రి డాక్టర్ బాబు మోహన్కు ప్రఖ్యాత రేలంగి అవార్డు లభించింది. తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ఈ అవార్డును ప్రదానం చేశాయి. సుమారు 2000కు పైగా చిత్రాలలో నటించిన బాబు మోహన్కు ఈ అవార్డు రావడం సినీ వర్గాల్లో ఆనందాన్ని నింపింది. ఆయన 41 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని గుర్తిస్తూ నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ, నటనలోనే కాదు రాజకీయాల్లో కూడా బాబు మోహన్ విశేష సేవలు అందించారని కొనియాడారు. సాధారణ వ్యక్తిత్వం, సేవాభావం, హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనకు లభించిన గౌరవంపై స్పందించిన బాబు మోహన్, ప్రజల ప్రేమే తనకు పెద్ద అవార్డు అని పేర్కొన్నారు. ఇంకా సినిమాల్లో నటిస్తూ, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు.












.avif&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!