
సినిమాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న విడుదల కానుండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సందడి ఇప్పటికే మొదలైంది. హైదరాబాద్లోని కూకట్పల్లి అర్జున్ థియేటర్ వద్ద మెగా అభిమానులు ‘పెద్ది’ సినిమాలోని రామ్ చరణ్ లుక్ను పోలి ఉండే భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
విగ్రహంతో పాటు ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, అభిమానులు క్షీరాభిషేకాలు, హారతులు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో థియేటర్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!