
సినిమాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆనందాన్ని పంచే భారీ అప్డేట్ బయటకు వచ్చింది. మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఓజీ’కి సీక్వెల్గా రూపొందనున్న ‘ఓజీ 2’ పనులు అధికారికంగా ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించారు. దర్శకుడు సుజీత్తో స్టోరీ డిస్కషన్స్ ప్రారంభమైన సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
“ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయాణం ప్రారంభమైంది” అనే భావంతో మేకర్స్ చేసిన పోస్ట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఈ సీక్వెల్కు కూడా సంగీత సంచలనం ఎస్.ఎస్. థమన్ స్వరాలు అందించనున్నట్లు సమాచారం. మొదటి భాగం సృష్టించిన సంచలనాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!