
రాజకీయాలు

‘రాజు వెడ్స్ రాంబాయి’ తర్వాత మరో అర్థవంతమైన కథతో చిత్రబృందం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అన్నదమ్ముల పంచాయితీ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ కుటుంబాల్లో తరచుగా కనిపించే అన్నదమ్ముల మధ్య విభేదాల నేపథ్యంలో సాగనుంది. ఒక కుటుంబం చీలిపోతే నష్టపోయేది కేవలం ఆ కుటుంబమేనా, లేక ఆ ఊరంతా అనే ఆలోచనాత్మక ప్రశ్న చుట్టూ కథ రూపుదిద్దుకున్నట్లు చిత్రబృందం తెలిపింది.
ఈ చిత్రానికి మధుకర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, వేణు ఉడుగుల మరియు సంధ్యాభాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, కుటుంబ బంధాలు, భావోద్వేగ అంశాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కథా బలం, సందేశాత్మక అంశాలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!