

సాధారణంగా ప్రమోషన్లకు దూరంగా ఉండే లేడీ సూపర్ స్టార్ నయనతార ఈసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం ప్రమోషన్లలో పాల్గొనడం హాట్ టాపిక్గా మారింది. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నయనతార స్వయంగా అనిల్ రావిపూడిని ప్రమోషన్ల గురించి ప్రశ్నిస్తూ, ఆయన సరదాగా షాక్ అయి స్పందించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నయనతార “జనవరి 12 న మన శంకరవరప్రసాద్ గారు విడుదల” అని అనౌన్స్ చేయడం హైలైట్. “హలో మాస్టారు.. కెమెరా కొంచెం రైట్ టర్నింగ్ ఇవ్వండి” అంటూ నయనతార చెప్పడం, పక్కన అనిల్ రావిపూడి కనిపించడం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ వీడియోతో సినిమాపై భారీ బజ్ ఏర్పడిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
స్టార్ హీరోల సినిమాలైనా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార, చిరంజీవి సినిమా కోసం స్వయంగా పాల్గొనడం మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఈ చిత్రంలో నయనతార శశిరేఖ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. చిరంజీవి, నయనతార జంటగా ఇది మూడవ చిత్రం కావడంతో పాటు, అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్లతో ‘మన శంకరవరప్రసాద్ గారు’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!