

నందినీరెడ్డి తన సినీ ప్రయాణాన్ని బాలీవుడ్ వరకు విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం విజయవంతం కావడంతో నందినీరెడ్డికి హిందీ చిత్రసీమ నుంచి అవకాశాలు వస్తున్నాయి. మంచి కథ దొరికితే బాలీవుడ్లో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. కథకు భాషతో సంబంధం లేదని, మంచి కథ ఉంటే ఏ భాషలోనైనా చెప్పొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
తాను రెండేళ్లు ఢిల్లీలో చదువుకున్న సమయంలో హిందీ సినిమాలపై మంచి అవగాహన ఏర్పడిందని నందినీరెడ్డి తెలిపారు. అలాగే అక్టోబర్ నుంచి డార్క్ సూపర్నేచురల్ వెబ్సిరీస్ చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు లైట్హార్టెడ్ కథలతో ప్రేక్షకులను అలరించిన ఆమె, ఈసారి ఓటీటీ వేదికపై భిన్నమైన జానర్లో తన ప్రతిభను చూపించేందుకు సిద్ధమవుతున్నారు. 2027 ప్రారంభంలో తన తదుపరి సినిమా ప్రారంభమవుతుందని వెల్లడించిన నందినీరెడ్డికి బాలీవుడ్లో కూడా ఘన విజయం దక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!