

మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత సయాలీ సర్వే మరియు ఆమె నలుగురు పిల్లలు అదృశ్యమైన ఘటన పూణేలోని పింప్రి–చించ్వాడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇటీవల ఆమె మత మార్పిడి చేసుకుని తిరిగి హిందూమతంలోకి వచ్చిన విషయం నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. సయాలీని ఆమె భర్త మరియు అత్తింటివారే అపహరించారని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సయాలీ సర్వే కొన్నేళ్ల క్రితం ఇస్లాంలోకి మారి వివాహం చేసుకుని తన పేరును అతీజాగా మార్చుకున్నారు. అయితే పెళ్లి తర్వాత భర్త నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లు ఆమె ఆరోపించారు. అనంతరం తన నలుగురు పిల్లలతో కలిసి బయటకు వచ్చి తిరిగి హిందూమతంలోకి మారి, తన పేరును ఆద్య సుర్వేగా మార్చుకున్నారు. ఈ పరిణామాల తర్వాత కొద్ది రోజులకే ఆమె మరియు పిల్లలు కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పింప్రి–చించ్వాడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!