

టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన కన్నప్ప చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు, సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాలను పంచుకోగా అవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
షూటింగ్ సమయంలో తన పాత్ర కోసం శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాల్సి వచ్చిందని, అందుకే ప్రోటీన్స్ కోసం నాన్వెజ్ ఆహారం తీసుకున్నానని విష్ణు తెలిపారు. తాను పుట్టుకతోనే నాన్వెజిటేరియన్ కావడంతో అందులో ఎలాంటి తప్పు కనిపించలేదని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వ్యక్తిగత ఆహారపు అలవాట్లను గౌరవించాలని అంటుండగా, మరికొందరు భక్తిరస చిత్రానికి సంబంధించిన పాత్ర పోషించే సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!